PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అర్జీదారుడికి అర్థమయ్యే రీతిలో ఎండార్స్మెంట్ ఇవ్వండి

1 min read

– జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : అర్జీదారుడికి అర్థమయ్యే రీతిలో అతను  పెట్టుకున్న అర్జీకి నాణ్యతతో కూడిన ఎండార్స్మెంట్ ఇవ్వాలని  జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య  అధికారులను ఆదేశించారు. శుక్రవారం జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమం నిర్వహణ లో భాగంగా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లోని సిల్వర్ జూబ్లీ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను  జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య స్వీకరించారు.ఈ సందర్భంగా  జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమంలో  వచ్చిన అర్జీలకు సంబంధిత అధికారులు ఎలా అంటే అలా ఎండార్స్మెంట్ లు ఇవ్వకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎండార్స్మెంట్ లు ఇవ్వాలని అపుడే రీ ఓపెన్ కేసుల శాతం తగ్గే అవకాశముందని అన్నారు … ముఖ్యంగా ఆర్జీలలో రెవెన్యూ కి సంబంధించి మిగులు భూమి, అడ్డంగల్ కరెక్షన్స్ లాంటి పరిష్కారమయ్యే  చిన్న చిన్న సమస్యలకు కూడా అర్జీదారులు కర్నూలు జిల్లాకు వచ్చి మరి అర్జీలు ఇస్తున్నారని ఇక్కడ మీ పరిధిలో పరిష్కారం అయ్యే వాటికి ఇక్కడే పరిష్కారం చేయాలని, పరిష్కారం చేయలేని వాటికి ఎందుకు చేయలేకపోతున్నాము అనేది కూడా స్పష్టంగా ఎండార్స్మెంట్ లో వివరించాలన్నారు.  లబ్ధిదారులకు కేటాయించిన టిడ్కో ఇళ్ళలో 3 నెలలు నుండి కరెంట్ బిల్లులు కట్టలేదని వారి ఇళ్ళ వద్దకు వెళ్లి కరెంట్ కనెక్షన్ కట్ చేస్తున్నారని  మీడియా ప్రతినిధులు స్పందనలో జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా అటువంటి సమస్యల పై తగిన చర్యలు తీసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని తెలిపారు..తొలుత స్పందన కార్యక్రమం కంటే ముందు అర్జీలు నమోదు చేసే కేంద్రాన్ని పరిశీలిస్తూ అర్జిదారుడు ఇచ్చిన అర్జీ కి సంబంధిత విభాగం కింద తప్పులు లేకుండా నమోదు చేయాలని  ఎన్రోల్మెంట్ ఆపరేటర్లకు జాయింట్ కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్,  జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి,  ఆదోని తహసిల్దార్ వెంకట లక్ష్మీ, ఆదోని మునిసిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఎంపిడిఒ గీత మూర్తి, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author