PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబుతోనే వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు విముక్తి

1 min read

శాతనకోటలో  భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తోనే వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు విముక్తి లభిస్తుందని ఎస్సీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గిత్త జయసూర్య పేర్కొన్నారు. నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గౌరు వెంకటరెడ్డి ల నాయకత్వంలో  రాష్ట్ర ఎస్సి సెల్ ఆర్గనైసింగ్ సెక్రెటరీ జయసూర్య ఆధ్వర్యంలో శాతనకోట గ్రామంలో మంగళవారం  భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా టీడీపీ నాయకులు జయసూర్య ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు  ప్రకటించిన మినీ మానిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు.వైసిపి ప్రభుత్వ అరాచకాలను వివరిస్తూ వీటన్నిటి నుంచి విముక్తి కలిగించేందుకు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ తమ ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు ఆయన వివరించారు. కార్యక్రమంలో నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, నారాయణ, ఎంపీటీసీ సుబ్బయ్య,  ఆలిముద్దీన్, సలీమ్ బాషా, రామకృష్ణ, శివకుమార్ రెడ్డి, మాల నాగరాజు, వార్డుమెంబెర్ నూరుద్దీన్, అజీస్, మహమూద్ ఖాద్రి, రవి తదితరులు పాల్గొన్నారు.

About Author