PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం సర్​ మా జీవితాల్లో వెలుగు నింపండి..

1 min read

కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులు..

పల్లెవెలుగు వెబ్ గడివేముల : ప్రతిపక్ష నేత హోదాలో గతంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని శనివారం నాడు గడివేముల మండలంలోని కాంట్రాక్టు విద్యుత్ కార్మికులు విజ్ఞప్తి చేశారు .. ప్రతి ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపే తమకు తమ కుటుంబాలలో వెలుగులు నింపలేకపోతున్నామని అరకొర జీతాలతో భద్రత లేని విధులను నిర్వహిస్తున్నామని గత నాలుగు సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తున్న తమ సమస్య తీర్చడం లేదని ప్రభుత్వం దయచేసి తమకు రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి వేడుకున్నారు .. ఈ కార్యక్రమంలో కరీం సురేంద్ర నాథ్ రెడ్డి చక్రవర్తి. మద్దిలేటి. గపూర్ .మహేశ్వర్ రెడ్డి. రాఘవరెడ్డి. చాంద్ బాషా. సుధాకర్ .రామాంజనేయులు. నాగశేషులు.  శ్రీనివాసులు. పాల్గొన్నారు.

About Author