PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాఠశాలల… పుస్తకాల షాపులా..

1 min read

• ఏపీఎస్​యూ జిల్లా అధ్యక్షులు బి. భాస్కర్ నాయుడు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: పాఠశాలలను పుస్తకాల షాపులుగా మార్చిన ప్రైవేట్ కార్పోరేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ స్టూడెంట్స్ యూనియన్ ఏ.పీ.ఎస్.యు జిల్లా అధ్యక్షులు బి భాస్కర్ నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్​లోని డీఈఓ సాయిరాంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్​ నాయుడు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని పుస్తకాలు విక్రయిస్తున్న పలు కార్పొరేట్ పాఠశాలలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నత ప్రమాణాలతో విద్యను బోధిస్తామని ప్రకటనలు గుప్పించిన ప్రైవేట్​, కార్పొరేట్​ పాఠశాలల వలలో పేద, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు చిక్కుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పుస్తకాలు, యూనిఫాం, ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నాయని, ఆయా పాఠశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఏపీఎస్​యూ జిల్లా అధ్యక్షులు భాస్కర్​ నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

About Author