PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల వివరాలను వేగవంతంగా పూర్తి చేయండి

1 min read

– జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఎన్నికల నిర్వహణ నిమిత్తం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విధులు నిర్వహించే సిబ్బంది యొక్క వివరాలను ఆన్లైన్ లోని ఎన్ఐసి పోర్టల్ లో వేగవంతంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్ లోని కమ్యూనికేషన్ సెంటర్ లో ఉద్యోగస్తుల వివరాల నమోదు ప్రక్రియను జిల్లా రెవెన్యూ అధికారి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తేది నుంచి ఉద్యోగస్తుల వివరాలను ఎన్ఐసి పోర్టల్ అప్లోడ్ చేసే ప్రక్రియ ప్రారంభమైనదని, అందులో భాగంగా కలెక్టరేట్ లోని కమ్యూనికేషన్ సెంటర్ ను సందర్శించి నమోదు వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఉద్యోగుల నమోదు ప్రక్రియను పూర్తి చేయుటకు గాను అన్ని శాఖల డిడిఓలు వారికి కేటాయించిన సమయంలో కమ్యూనికేషన్ సెంటర్ కు వచ్చి వారి కార్యాలయ సిబ్బంది యొక్క వివరాలను ఎన్ఐసి పోర్టల్ నమోదు చేయించాలన్నారు. ఇప్పటి వరకు 4688 మంది ఉద్యోగుల వివరాలు నమోదు చేయడం జరిగిందన్నారు. సిబ్బంది వివరాలను వేగవంతంగా పూర్తి చేయడానికి గాను అదనంగా కంప్యూటర్లు, సిబ్బందిని కేటాయించి ఉద్యోగుల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.కార్యక్రమంలో జిల్లా ఖజానా అధికారి రామచంద్రరావు, ఉపాధి కల్పన అధికారి దీప్తి, ఎటిఓ జయలక్ష్మి, ఎస్టీఓ సునీల్, ఎంఈఓలు, హెడ్మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author