PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

1 min read

పల్లెవెలుగు  వెబ్ మంత్రాలయం:   ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని మాధవరం ఎస్సై కిరణ్ బాబు హెచ్చరించారు. మంగళవారం మండల పరిధిలోని మాధవరం పోలీసు స్టేషన్ లో  ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రాగి వాహనం నడపరాదని సూచించారు. ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్,  ఇతరత్రా సర్టిఫికెట్స్  తప్ప క ఉండాలని సూచించారు. అలాగే ప్రయాణికుల పట్ల అనుచితంగా వ్యవహరించకూడదని సూచించారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్ప కుండా పాటించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సదస్సులో ఏఎస్ ఐ బందేనవాజ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

About Author