PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మద్దికేర మండలంలో వైసిపి ఎన్నికల ప్రచారం   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పత్తికొండ నియోజకవర్గం లోని మద్దికేర మండలంలో వైసిపి ఎన్నికల ప్రచారాన్ని  ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రమైన మద్దికేర లోని మద్దమ్మ గుడి వీధిలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ వైసీపీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. .ముందుగా స్థానిక మద్దమాంబ దేవాలయంలో మద్దమాంబ దేవతకు  ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  కులమతాలకు అతీతంగా అందించారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా ఆదరించాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు, మైనార్టీ నాయకులు, మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసి సభ్యులు, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author