PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏనుగు తొండం దెబ్బ.. వ్యక్తి మృతి

1 min read

స్పెయిన్ : స్పెయిన్ లోని ఓ పార్కులో ఏనుగు తొండం దెబ్బకి .. వ్యక్తి మృతి చెందారు. స్పెయిన్ లోని ఓ జూలో ప‌ని చేస్తున్న గెటెర్రెస్ అనే వ్యక్తిని ఏనుగు త‌న తొండంతో దాడి చేసింది. దీంతో అత‌ను తీవ్రగాయాల పాల‌య్యాడు. అనంత‌రం అత‌నిని ఆస్పత్రికి త‌ర‌లిస్తున్న స‌మ‌యంలో.. మార్గ మ‌ధ్యలో అత‌ను మ‌ర‌ణించాడు. అయితే.. ఆ ఏనుగు క‌డుపుతో ఉంద‌ని… ఇటీవ‌లే ఏనుగుకు కాలికి దెబ్బ త‌గ‌లి… ఇన్ ఫెక్షన్ అయింద‌ని, గాయం ఎలా ఉందో తెలుసుకోవ‌డాని వెళ్లిన వ్యక్తిని ఏనుగు త‌న తొండంతో దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచింద‌ని జూ అధికారులు తెలిపారు. ప్రధానంగా గెటెర్రెస్ నిర్లక్ష్యం వ‌ల్లే ఆ దుర్ఘట‌న జ‌రిగింద‌ని జూ ఉన్నతాధికారులు తెలిపారు.

About Author