PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

90.02% మందికి పింఛన్​ పంపిణీ

1 min read
దివ్యాంగులకు పింఛన్​ అందజేస్తున్న డీఆర్​డీఏ పీడీ శ్రీనివాసులు

దివ్యాంగులకు పింఛన్​ అందజేస్తున్న డీఆర్​డీఏ పీడీ శ్రీనివాసులు

పల్లెలు కర్నూలు : వైస్సార్ పెన్షన్ కానుకలో భాగంగా 4,49,356 మందికి రూ.109.01 కోట్లు కర్నూల్ జిల్లాకు మంజూరు చేయటం జరిగినది. మార్చి ఒకటవ తేదీన తెల్లవారుజామున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టి సాయంత్రం 6 గంటల వరకు 4,04,427 మంది పెన్షన్ ధారులకు 94.22 కోట్ల రూపాయలు పంపిణీ చేయటం జరిగినది. సోమవారం కర్నూలు మండలం నిడ్జూర్ గ్రామంలో ప్రాజెక్టు డైరెక్టర్ డిఆర్డిఏ-వైకెపి యం.కె.వి శ్రీనివాసులు దివ్యాంగులైన కురువ శ్రీరాములు, కురువ పార్వతమ్మ, షేక్ రుక్మత్కు పింఛన్లు అందజేశారు. సాయంత్రం 6 గంటల వరకు 90.02% పెన్షన్లను పంపిణీ చేశారు. అదేవిధంగా మంగళ, బుధవారాల్లోనూ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. వేలి ముద్రలు పడని వారికి వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఆధార్ నిర్ధారణ ద్వారా గుర్తుంచి పెన్షన్స్ పంపిణీ చేస్తామని ప్రాజెక్టు డైరెక్టర్ డిఆర్డిఏ-వైకెపి యం.కె.వి శ్రీనివాసులు తెలిపారు.

About Author