PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి ని చేయాలి

1 min read

కూటమి అభ్యర్థుల మాయమాటలు నమ్మవద్దు

కార్పొరేటర్ బోద్దాని అఖిలప్రియ ఇంటింటా ప్రచారం

పాల్గొన్న పార్టీ శ్రేణులు, మహిళలు కార్యకర్తలు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మే 13 జరగబోవు ఎన్నికల మహా సంగ్రామంలో భాగంగా ఏలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మరియు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ ని గెలిపించుటకు ఏలూరు మూడో డివిజన్ కార్పొరేటర్ మాజీ స్మార్ట్ సిటీ చైర్ పర్సన్ బొద్దాని అఖిలమ్మ ఆధ్వర్యంలో ఇంటింటికి  ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా ఆళ్ల నాన్నని, ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ ని గెలిపించాలని ఓటర్లను సవినయంగా శిరసు వంచి నమస్కరిస్తూ అభ్యర్థన చేశారు. జగనన్న పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు వేయాలని, దుర్మార్గపు చంద్రబాబు నాయుడు మాయమాటలు నమ్మవద్దని చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పడుతుందని అసలు కూటమి అభ్యర్థులను మాయమాటలు నమ్మవద్దని ముసల కన్నీరుతో రంగులు మార్చే ఊసరవెల్లిలా వారు ప్రవర్తిస్తున్నరన్నరు. ఈరోజు సాయంత్రం ఆదివారం 4 గంటల నుండి నక్కబోస్  రోడ్లు నవాబ్ పేట, వాటర్ ట్యాంక్ రోడ్లు, సత్యనారాయణపేట పార్క్ , రోడ్లు ఏసుపాద పురం అన్ని రోడ్లు ప్రతి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించడం జరిగిoది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు బోద్దాని శ్రీనివాస్, పార్టీ శ్రేణులు మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం చేశారు.

About Author