నేడు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: గురువారం కర్నూలు నియోజకవర్గ పరిధిలోని 19 వార్డుల్లో 31 రకాల అభివృద్ధి పనులకు శుక్రవారం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ శంకుస్థాపనలు చేయనున్నారని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.15వ ఆర్థిక సంఘం, యన్క్యాప్, సాధారణ నిధులకు సంబంధించి 1,3,6,8,10,13,14,15,16,18,23,24,42,43,44,45,46,48,49 వార్డుల్లో అభివృద్ధి పనులకు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేస్తారని కమిషనర్ పేర్కొన్నారు.

