విద్యార్థులకు ప్రాఫిట్ షూ కంపెనీ ఘన సత్కారం!
1 min read
విజయవాడ, న్యూస్ నేడు: డివిజన్ ల వారిగా మండలస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థులకు, ప్రోత్సాహాన్ని అందించిన ప్రధాన ఉపాధ్యాయులకుప్రాఫిట్ షూ సంస్థ ఆధ్వర్యంలో హనుమాన్ పేట, ప్రాఫిట్ షూ కంపెనీ కార్యాలయంలో ఆత్మీయ సత్కారం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే రామమోహన్ రావు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు గద్దె రామమోహనరావు, బోండా ఉమామహేశ్వరరావు లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారని, ప్రభుత్వం నుండి అన్ని విధాల సహాయ సహకారాలు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అందిస్తామన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు తలెత్తుకునేలా విద్యలో రాణించాలని పలు సూచనలు చేశారు. విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రాఫిట్ షూ కంపెనీ చైర్మన్ కోటేశ్వరరావుని అభినందించారు.ఉత్తమ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ప్రాఫిట్ షూ సంస్థ అధినేత జి ఎస్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులను చైతన్యవంతులను చేయడానికి ప్రోత్సాహం ఎంతో అవసరమని, అందులో భాగంగా తాము ఈ సత్కార కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు గుర్తింపు నివ్వటం, ప్రోత్సహించటంద్వారా విద్యలోఅత్యధిక శిఖరాలు అధిరోహించటానికి ఆస్కారం ఉంటుందని స్పష్టంచేశారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, ట్రాన్స్పోర్ట్ బ్యాగులు, షూస్, నగదు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ షూ కంపెనీ యాజమాన్యంతో పాటు కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
