యోగ ఆక్యుప్రెషర్ తో ప్రపంచ ఆరోగ్యం
1 min read
యోగ శక్తి సాధనా సమితి
విజయవాడ, న్యూస్ నేడు : ఆరోగ్యానికి,శాంతికి భారతదేశ పు యోగులు లక్షలాదిమంది మోడల్స్ గా ఉన్నారని అలాంటి వారి గా తయారవ్వటానికి ప్రధానమంత్రి ఫిట్నెస్ మంత్ర ఉపయోగపడుతుందని యోగ శక్తి సాధనా సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.యోగాలోని ఐదు కోశాలు 1అన్నమయ కోశా 2 ప్రాణమయ 3 మనోమయ 4 జ్ఞానమయ మరియు 5 ఆనందమయ కోశాలలో ప్రాణమయకోశ ప్రాధాన్యత మేరకు అందుబాటుతనం,వాడకం తక్కువ ఉండటం ప్రజలందరికీ ప్రాణమయ కోశా శిక్షణ, చికిత్సలు అందుబాటులోనికి తెచ్చి ఆరోగ్యం ఆనందం మరియు పూర్ణ ఆయుష్ అందించే లక్ష్యంతో ఏర్పడ్డ యోగ శక్తి సాధనా సమితి భారత ప్రధాన మంత్రి మోడీ అందించిన ఫిట్నెస్ మంత్ర ని ఇంటింటికి చేరువ చేయడంతో సాధించవచ్చునని ఇంటర్నేషనల్ యోగ డే 2025 కార్యక్రమాలలో భాగంగా 21 రోజులపాటు జరిగే ఉత్సవాల లో భాగంగా డాక్టర్ గురురాజు హోమియో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆవరణలో జరిగింది. ప్రిన్సిపాల్ డాక్టర్ రమాదేవి ప్రారంభించి విద్యార్థుల కు, స్టాఫ్ కు మోడీ హెల్త్ కేర్ స్టిక్స్ పంపిణి చేసారు.ప్రార్ధన,నమస్కారముద్రలో ఓంకార ప్రాణాయామ,మోడీ హ్యాండ్ స్టిక్ వాడకము -ఆరోగ్య ప్రయోజనాలు,మెడిటేషన్,చెవుల మర్దన,బేర్ ఫుట్ వాక్- ప్రయోజనాలు తెలిపి,నాడీ శోధన చేసి వ్యక్తిగత డైట్ ప్లాన్ మరియు చికిత్స ప్లాను ఇవ్వటంతో ఎవరి ఆరోగ్యం వారే పొందే లాగా ఇకముందు అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యం, ఆనందం గురించి అవగాహన కలిగించినట్లు వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.’యోగాంద్ర’ప్రజారోగ్య కార్యక్రమం ఏర్పాటు చేసి, ప్రజలకు యోగ త్వరితగతిన చేరువ చేయడానికి విశాఖపట్నంలో ప్రధానమంత్రి సే జూన్ 21న ప్రారంభించడానికి దాని ముందు ఒక నెలపాటు రాష్ట్రమంతా జరిగే సన్నాహ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశమంతా గుర్తించే లాగా ఖ్యాతి గడిoచారని డాక్టర్ మకాల సత్యనారాయణ కొనియాడారు.డాక్టర్ రాధాకృష్ణ, శిరోమణి, సత్యనారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ సేవలు అందించారు. హోమియో కాలేజీ యాజమాన్యం డాక్టర్ మాకాల సత్యనారాయణ ను ఘనంగా సన్మానం చేశారు.
