ఒలింపిక్ పరుగులో పాల్గొందాం..
1 min read
ఒలింపిక్ రన్ లోగో ను ఆవిష్కరించిన
కె యి ప్రభాకర్ కర్నూల్ స్టాప్ రిపోర్టర్ ప్రపంచ ఒలంపిక్
కర్నూలు, న్యూస్ నేడు: దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఒలింపిక్ సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీ సోమవారం కర్నూల్ నగరంలో ఒలంపిక్ డే రన్ నిర్వహించందుకు ఒలంపిక్ సంఘం చైర్మన్ కె.ఈ. ప్రభాకర్ నిర్ణయించారు, ఈ సందర్భంగా నగరంలోని కె.ఈ ప్లాజా లో ఏర్పాటు చేసిన ఒలంపిక్ రన్ లోగోను శనివారం ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా లో క్రీడా స్పీర్తి ని చాటెందుకు కర్నూలు లో ఒలంపిక్ పరుగు ను నిర్వహిస్తున్నామని అన్నారు , ఈ పరుగు లో ప్రతి ఒక్కరం భాగస్వాములై విజయవంతం ఆయన పిలుపునిచ్చారు, నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు క్రీడాకారులు , జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడలను ప్రోత్సహించే ప్రతి ఒక్కరు ప్రాతినిధ్యం వహించాలని ఆయన సూచనలు ఇచ్చారు. ఈ పరుగు నగరంలోని నాలుగు ప్రాంతాల నుండి స్టేడియం వన్ టౌన్ పోలీస్ స్టేషన్,( ఖన ఖజానా) సిల్వర్ జూబ్లీ కాలేజ్, చెన్నమ్మ సర్కిల్ ప్రాంతాల నుండి ర్యాలీ , రాజ్ విహార్ కు చేరుకుంటారు అక్కడి నుండి మౌర్యాని మీదుగా స్టేడియం కు చేరుకుంటారు కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ అధ్యక్షులు కేఈ జగదీష్ కుమార్ కార్యదర్శి జి శ్రీనివాసులు జిల్లా ఒలింపిక్ సీఈవో పి విజయ్ కుమార్ ఒలింపిక్ ఉపాధ్యక్షులు షరీఫ్ అహ్మద్, క్రీడా సంఘాల ప్రతినిధులు రుద్రారెడ్డి , అవినాష్ శెట్టి, టైక్వండో సతీష్ కుమార్, కబడ్డీ సుభకర్ లు పాల్గొని ఒలింపిక్ లోగో ను ఆవిష్కరించారు.