PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం.. ఎక్సైజ్ మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  నంద్యాల జిల్లా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటానికి శనివారం పాలాభిషేకం నిర్వహించారు. ఎస్ ఈ బి రద్దు తో పాటు పాత ఎక్సైజ్ విధానాన్ని ఏకీకరణ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాలాభిషేకం నిర్వహించినట్లు నంద్యాల ఎక్సైజ్ సీఐ విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. పాత విధానం పునరుద్ధరించడం వల్ల అధికారులకు మరియు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అందరికీ ఉపయోగకరంగా ఉండడంతో పాటు విధులు నిర్వర్తించడానికి సౌలభ్యంగా ఉంటుందన్నారు. పాలాభిషేకం సందర్భంగా అధికారులు మరియు సిబ్బంది ఎక్సైజ్ పాత విధానం అమల్లోకి రావడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ విజయ్ కుమార్ ఎస్సై శంకరయ్య సిబ్బంది మోహన్ కృష్ణ ,ఫాజిల్ బి పద్మనాభం తదితరులు పాల్గొన్నారు .

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *