PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాదిగ గోవిందమ్మకు అండగా ఉంటాం: బి.యస్.పి

1 min read

కులవివక్షతతో దాడికి గురైన మాదిగ గోవిందమ్మను పరామర్శించిన ఉమ్మడి కర్నూలు జిల్లా బి.యస్.పి. నాయకులు మరియు రాష్ట్ర నాయకులు

మాదిగ గోవిందమ్మకు అండగా ఉంటాం: బి.యస్.పి.

పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు:  పెద్దకడుబూరు మండలం, కల్లుకుంట గ్రామంలో 12 వ తారీకు గురువారం రాత్రి మాదిగ గోవిందమ్మ మీద జరిగిన దాడి.మానవత్వానికే మచ్చ తెచ్చిన సంఘటనను తీవ్రంగా ఖండించిన బిఎస్పి నాయకులు ఈ దాడిలో పాల్గొన్న 200 మందిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు చాకలి కులస్తులను మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. రెచ్చగొట్టినటువంటి వాల్మీకి కులస్తులను మిగతా కులాల వారిని గుర్తించి అందరిని అరెస్ట్ చేయాలని. వారు డిమాండ్ చేశారు. స్థానిక సంబంధిత డీఎస్పీ, సి.ఐ. ఎస్.ఐ కి  దాడిలో పాల్గొన్న వారందరిని గుర్తించి అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇవ్వాలనిమరియు ప్రభుత్వము నుండి రావలసినటువంటి ఆర్థిక నష్టపరిహారమును మాదిగ గోవిందమ్మ కు ఇవ్వాలని కలెక్టర్  ఎస్పీ  కల్లుకుంట గ్రామాన్ని దర్శించాలని బాధితురాలికిన్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలోబీఎస్పీ రాష్ట్ర నాయకులు వనుములయ్య, రామ శేషయ్య నంద్యాల జిల్లా ఇన్చార్జి, మౌలాలి,నంద్యాల జిల్లా నాయకులు లాజరు, కర్నూలు జిల్లా నాయకులు ఏ.సీ.దేవదానం, శాంత కుమార్ , రాజ్ కుమార్, ఎమ్మిగనూరు నాయకులు జయరాజు, ఎద్దుల చెన్నయ్య, పూలే అంబేడ్కర్ సొసైటీ అధ్యక్షులు ఎస్.నరసన్న తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *