వైయస్సార్సిపి పార్టీ విస్తృత స్థాయి సమావేశం
1 min read

ఆలూరు, న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండల కేంద్రంలో వైయస్సార్సిపి పార్టీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూట్యూటీ మోసం గ్యారెంటి కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైనా.. ఆలూరు_వైసీపీ ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_ మాట్లాడుతూ ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి చంద్రబాబు నాయుడు మీకు ఎంత అప్పు ఉన్నారో చూడవచ్చు అన్నారు, చంద్రబాబు నాయుడు ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు, మన జగనన్న ప్రతి ఒక్క నాయకుని కార్యకర్తని రాబోయే రోజుల్లో గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారన్నారు, అలాగే నేను కూడా నాయకులకు కార్యకర్తలకు పూర్తిగా ఎవరు ఊరు వాళ్ళకె వర్క్స్ ఇస్తామన్నారు, మీరు మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యక్రమలను కస్టపడి చేయాలన్నారు, అలాగే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరు కష్టపడి పనిచేయాలన్నారు.తల్లికి వందనం పథకాన్ని 15 వేలు రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పుడేమో కేవలం 13వేలు మాత్రమే ఇచ్చాడు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ఇంతవరకు ఇవ్వలేదు అన్నారు, చంద్రబాబు నాయుడు రైతులను నట్టేట ముంచుతున్నారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ సొసైటీ చైర్మెన్, ఆలూరు నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.


