PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పట్టణ అభివృద్ధే  లక్ష్యం….

1 min read

సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు

పల్లెవాణ  వెబ్  ఎమ్మిగనూర్ : పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్దే లక్ష్యంగా ముందుకు పోతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర రెడ్డి అన్నారు. పట్టణంలోని 25వ వార్డు సాయి గణేష్ కాలనీ, 33 వ వార్డు, 16వ వార్డు చునంబట్టి దగ్గర, 14వ వార్డు గూడూరు బైపాస్ రోడ్డు, 23వ వార్డు బుడగ జంగాల ఏరియా, 5వ వార్డు శివనగర్ కాలనీ ప్రాంతాల్లో సీసీ రోడ్లు,  డ్రైనేజీ నిర్మాణాలకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి  భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ  మాట్లాడుతూ ఒక కోటి నాలబై లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అన్ని వార్డులను అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. త్వరలోనే  ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు మూడు పూటలా తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని వార్డుల్లో ప్రధాన రహదారుల్లో పరిశుభ్రత లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే రెండుకల్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, డి ఈ మనోహర్ రెడ్డి, ఆయా వార్డు ఇన్చార్జులు, వార్డు కౌన్సిలర్లు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *