సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం
1 min read

హొళగుంద న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ మరియు టీడీపీ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు….హొళగుంద మండలంలోని హెబ్బటం గ్రామంలో తెలుగు యువత జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, విష్ణువర్ధన్ రెడ్డి, ఆధ్వర్యంలో టీడీపీ యూనిట్ ఇంచార్జ్ B. సవారప్ప, బూత్ ఇంచార్జ్ లు, మల్లికార్జున, గోపాల్, శేక్షవాలి, నాగయ్య,,మండల రైతు సంఘం సభ్యులు, శేఖర్, బీజేపీ కాళప్ప,మాణిక్య,కృష్ణ,లు, 55,56,57,58 వ బూత్ ల్లో నిర్వహించిన “సుపరిపాలనలో తొలి అడుగు ” కార్యక్రమంలోపాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయం తెలుసుకొని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది.


