యూరియాను ఎంఆర్పి కి మించి అమ్మరాదు
1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుందమండలంలో ఉండే అగ్రి డీలర్లకు (ఫర్టిలైజర్, పెస్టిసైడ్ విత్తనాలు) మండల వ్యవసాయ అధికారి, ఆనంద్ లోకదళ్ వారి అధర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ఈ క్రింది విషయాలను వారికి తెలియజేయడం జరిగింది. మండలంలో ఉండే ఫర్టిలైజర్ వ్యాపారం చేసే డీలర్లు రైతుల అవసరాలకు సరిపడే యూరియాను తెప్పించుకోవాలి. అలాగే యూరియాను ఎంఆర్సి కి మించి అమ్మరాదు. రైతుకు ఖచ్చితంగా బిల్ ఇవ్వాలి. బిల్లు పైన రైతు సంతకం ఉండాలి. షాప్ ధరల పట్టిక, స్టాక్ పట్టికలు మరియు రికార్డులను ప్రతిరోజు తప్పనిసరిగా అప్డెట్ చేసుకోవాలి. నకిలి శిత్తనాఖ, పురుగు మందులు & బాయాస్ అమ్మరాదు. అమ్మినచో అట్టి వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ప్రతి డీలర్ తమ సేల్ రిపోర్ట్స్ ప్రతి నెల 5వ తేదీన తప్పనిసరిగా ఏఓ సబ్మిట్ చేయాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలింగ, అంబ్రెష్ , కడప్ప, శాలి ఖాదర్, ఏం సైఫుల్ల, తదితరులు పాల్గొన్నారు.

