కష్టపడిన వారికే పదవులు..
1 min read

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి
కల్లూరు PACS త్రిసభ్య కమిటీ చైర్మన్ గా దేవాలంకాటి శేఖర్ ప్రమాణ స్వీకారం
కర్నూలు, న్యూస్ నేడు : పార్టీలో కష్టపడిన వారికే పదవులు వరిస్తాయన్నారు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి . తెలుగు దేశం పార్టీలో ప్రతి కార్యకర్తకు, నాయకులకు గుర్తింపు ఉంటుందన్నారు. బుధవారం కర్నూలు పట్టణం రావూరి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో కల్లూరు PACS త్రిసభ్య కమిటీ మరియు PACS చైర్మన్ గా దేవాలoకాటి శేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి గౌరు వెంకట రెడ్డి మాట్లాడారు.ఈ కార్యక్రమం లో ఏపీ సీడ్స్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి ,నియోజకవర్గం పరిశీలకులు అదేన్న , మరియు పాణ్యం నియోజకవర్గం ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


