ఆలూరు ప్రభుత్వ హాస్పిటల్ ను తనిఖీ చేసిన వైసీపీ నాయకులు
1 min read
ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ ను వైఎస్ఆర్సిపి బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ నాయుడు తనకి చేపట్టారు అక్కడ ఉన్నటువంటి పేషెంట్లను సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే అక్కడున్నటువంటి కొంతమంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ బీపీ చెక్ చేయడం గ్లూకోస్ మరియు కట్ట కట్టడం చూసి ఆయన వారిపై ఆవేదన వ్యక్తం చేశారు మీకు ఈ పనులు చేయమని ఎవరు చెప్పారు పేషెంట్లకు ఏదైనా జరగరానిధి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు . అయితే ఈ విషయం పై డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ వారు ఆ పని చేయడం చాలా తప్పని డ్యూటీలో ఉండే నర్సులు చేయాలని ఆయన తెలిపారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాప్ సరిపోవడంలేదని తమరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సరైన స్టాప్ సమకూర్చాలని డాక్టర్ రామకృష్ణ భాస్కర్ నాయుడుకు తెలిపారు ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆయన డాక్టర్కు తెలిపారు.

