PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంపీ బైరెడ్డి శబరికి మరో అరుదైన గౌరవం..

1 min read

ఎంపీకి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ కాకరవాడ..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల పార్లమెంట్ సభ్యులు లోక్ సభ టిడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరికి మరో అరుదైన అవకాశం దక్కింది.ఐక్యరాజ్య సమితి సమావేశాలకు భారత ప్రతినిధిగా బైరెడ్డి శబరి ఎంపిక మన రాష్ట్రానికే గర్వకారణం అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి  డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి అన్నారు.మరో గౌరవ ఆథిత్య ఆహ్వానం పొందడం ఎంతో గర్వించ దగ్గ విషయమని 79 వ యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు అమెరికా దేశం న్యూయార్క్ నగరంలో నవంబర్ 18 నుండి 22 వరకు జరుగనున్నాయి.న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశంలో మన భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ నంద్యాల ఎంపీ శబరికి అవకాశం కల్పించారని ఐక్యరాజ్య సమితి సమావేశాలకు భారతదేశ ప్రతినిధిగా మాట్లాడేందుకు అవకాశం కల్పించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ లకు ఎంపీ శబరి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ఎంపీకి అరుదైన గౌరవం దక్కినందుకు గాను డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *