వైస్సార్సీపీ మహిళా కార్యవర్గ సమావేశం జయప్రదం చేయండి…
1 min read

హొళగుంద న్యూస్ నేడు : మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశను సారంరాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వరుదు కళ్యాణి ఎమ్మెల్సీ మరియు శ్రీమతి ఎస్వి విజయ మనోహరి రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 సోమవారం ఉదయం 10 గంటలకు కర్నూలు ఎస్వి కాంప్లెక్స్ కాన్ఫరెన్స్ హల్ నందు వైస్సార్సీపీ మహిళా కార్యవర్గ సమావేశం జరపాలని నిర్ణయించడం జరిగినది.కావున కర్నూలు,నంద్యాల, కడప,అనంతపురం,మరియు సత్యసాయి జిల్లాల మహిళా అధ్యక్షులు, 31 నియోజకవర్గాల మహిళా అధ్యక్షులు,జోనల్ ప్రెసిడెంట్ ,జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు,జాయింట్ సెక్రటరీలు ,మండల స్థాయి అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులందరూ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

