విద్యార్థులకు అనుగుణంగ సమయానికి బస్సు నడపాలి
1 min read

హొళగుంద న్యూస్ నేడు : విద్యార్థులు హోళగుంద తాసిల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో హోళగుంద తాసిల్దార్ నిజాముద్దీన్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ విరుపాపురం సులువాయి సమ్మతగేరి పెద్దహ్యట నాలుగు గ్రామాల విద్యార్థులు పాఠశాల కళాశాలలకు ఆలస్యంగా వెళ్లడంతో వాళ్లు పాఠశాల కళాశాలకు వెళ్లే లోపు ఒక పిరియడ్ కంప్లీట్ అవుతుంది అదేవిధంగా ప్రతిరోజు మాకు ఆప్షన్ టు పడుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల అనుకూలంగా బస్సు నడపాలని. విద్యార్థులు కోరుతున్నారు ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి వెంటనే విద్యార్థులకు అనుకూలంగా బస్సును నడపాలని విద్యార్థులు నాలుగు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

