పాఠశాల.. కళాశాల సమయానికి అనుకూలంగా బస్సులు నడపండి
1 min read

వైయస్సార్సీపి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండా అమారేష్
హొళగుంద న్యూస్ నేడు : ఆదోని డిఎంకు విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆలూరు హొళగుంద రూట్లో సులువాయి మీదగా నడిచే బస్సు ప్రభుత్వ పాఠశాల& జూనియర్ కళాశాల సమయానికి అనుకూలంగా నడపాలని కోరుతూ కొండ ఆమరేష్ ఆదోని డిఎం కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. పత్రం సమర్పించిన కొండా అమారేశ్ మాట్లాడుతూ విరుపాపురం ,సులవాయి, పెద్దహేట, సమతగేరి గ్రామాల ఎల్లార్తి, బిజె హళ్లి, హేబ్బటం, కోగిలతోట గ్రామాలు విద్యార్థులు పాఠశాల బస్సు ఆలస్యంగా వస్తుండడంతో తాము పాఠశాలలకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తుందని తాము వెల్లనప్పటికీ ఒక్కో పీరియడ్ అయిపోతుందని మొదటి పిరియడ్ అయిపోవడంతో తమకు ఆటెండెన్స్ లో ఆబ్సెంట్ పడుతుందని తెలియజేశాను. బస్సు ఉండి కూడా విద్యార్థులకు సమయానికి పాఠశాలలకు చేరుకుపోలేకపోతున్నామని ఆవేదం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు పాఠశాలకు ఉదయం 8 గంటలకు సాయంత్రం 5 గంటలకు సమయానికి బస్సు సర్వీసు నడపాలని కోరుతూ వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండా అమరేష , జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కే గిరి ఆదోని డిఎం కు విన వినపత్రం సమర్పించడం జరిగింద. ఈ కార్యక్రమంలో రావి ,మరి మల్ల తదితర నాయకులు పాల్గొన్నారు.


