కనకదాసు విగ్రహం పై దాడి చేసిన వారు ఎవరైనా సరే ఊపేక్షించేది లేదు..
1 min read

ఆలూరు న్యూస్ నేడు : కర్నూలు జిల్లా ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో భక్త కనకదాసు విగ్రహం ధ్వంసం చేయడాన్ని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఖండించారు… ఘటన పై గ్రామస్థులతో ఫోన్ లో మాట్లాడిన ఎంపీ నాగరాజు వివరాలను అడిగి తెలుసుకున్నారు… ఈ సందర్బంగా కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామంలో గొడవలు సృష్టించెందుకు కొందరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.. కనకదాసు విగ్రహం పై దాడి చేసిన వారు ఎవరైనా సరే ఊపేక్షించేది లేదన్న ఆయన , దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు.

