PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డెల్టా వేరియంట్..98 శాంపిల్స్ లో 97 పాజిటివ్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క‌రోన వైర‌స్ లోని డెల్టా వేరియ‌ంట్ ఆందోళ‌న పుట్టిస్తోంది. జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపిన కరోన నిర్ధార‌ణ ఫ‌లితాల్లో ఆందోళ‌న‌క‌ర ఫ‌లితాలు వెల్లడ‌య్యాయి. రాష్ట్రంలో క‌రోన పాజిటివిటీ రేటు తెలుసుకునేందుకు ప్రభుత్వం 98 శాంపిల్స్ ను క‌రోన నిర్ధార‌ణ ప‌రిక్షల‌కు పంపింది. ఈ నిర్ధార‌ణ ప‌రీక్షల్లో 97 శాంపిల్స్ క‌రోన పాజిటివ్ గా తేలింది. ఆ 97 మందికి కూడ డెల్టావేరియంట్ సోకిన‌ట్టు తేలింది. దీనిపై సిక్కిం ఆరోగ్యశాఖ మంత్రి ఎంకే శ‌ర్మ ఆందోళ‌న వ్యక్తం చేశారు. ప్రజ‌లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బాధితులు వెంట‌నే ఆస్పత్రుల్లో చేరాల‌ని కోరారు.

About Author