PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శర్వాకి జోడీగా రష్మిక..

1 min read

సినిమా డెస్క్​ : యంగ్‌ హీరో శర్వానంద్‌ తన దూకుడు ఏ మాత్రం తగ్గించడం లేదు. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు అనౌన్స్‌ చేయడమే కాదు వరుస షూటింగ్‌లు కూడా షురూ చేస్తున్నాడు. ‘మహాసముద్రం’ షూటింగ్ ని రీసెంట్‌గా కంప్లీట్ చేసిన శర్వా తాజాగా మరో కొత్త చిత్రం షూటింగ్‌ని స్టార్ట్ చేశాడు. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫస్ట్ టైమ్ శర్వాకి జంటగా రష్మిక మందన్న నటిస్తోంది. నిన్న ఈ మూవీ షూటింగ్‌ని ప్రారంభించారు. శర్వానంద్, రష్మిక జంటపై కీలక సన్నివేశాలను తీస్తున్నారు. ఇదో ఫ్యామిలీ ఎంటర్ టైనర్. శర్వానంద్, కిషోర్ కాంబినేషన్‌ ఇదే ఫస్ట్ మూవీ. అయితే శర్వా గతంలో ఇదే నిర్మాతతో ‘పడి పడి లేచె మనసు’ చేశాడు. వెన్నెల కిశోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్‌ రావత్, బెనర్జీ, కళ్యాణి, ఝాన్సీ, సత్యకృష్ణ, ఆర్‌సిఎమ్‌ రాజు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక శర్వానంద్‌ నటించిన బైలింగ్వల్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ విడుదలకు సిద్ధమ‌వుతోంది. ‘మహాసముద్రం’ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. మొత్తం మీద ఈ ఏడాది శర్వా నుండి బ్యాక్‌ టు బ్యాక్‌ మూడు సినిమాలు రాబోతున్నాయి.

About Author