NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి.. మంత్రి టీజీ భరత్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 15వ వార్డు పరిధిలోని దామోదరం సంజీవయ్య మున్సిపల్ పార్కులో 15వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పామన్న ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కార్పొరేటర్ శివమ్మ, వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పామన్న, పార్టీ నాయకులు అబ్బాస్, జేమ్స్, రవికుమార్, బూత్ ఇంచార్జిలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని 15వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పామన్న పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడం అభినందనీయమని చెప్పారు. ఈ దసరా పర్వదినం సందర్భంగా తాను విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించి పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నగరంలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు కార్మికులు చేస్తున్న కృషిని అభినందించారు. అలాంటి వారి సేవలను గుర్తించి వారికి ఇలాంటి ప్రోత్సాహకాలను అందజేయడం అభినందనీయమని తెలియజేశారు. నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, కర్నూల్ నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు అవసరమైన కృషి చేస్తున్నామని వెల్లడించారు. నగరంలోని అన్ని వార్డులలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తమ పార్టీ కార్పొరేటర్లతో పాటు నాయకులు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించి నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.

About Author