టిడిపి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి 20 కుటుంబాలు చేరిక
1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సమక్షంలో ఆలూరు మండలం మార్కాట్టు గ్రామంలో తెలుగుదేశం పార్టీని నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి 20 కుటుంబాలు చేరడం జరిగింది.పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం పై అసంతృప్తి చెంది ఈరోజు వైసీపీ పార్టలోకి వచ్చినారు అని అన్నారు, వైసీపీ పార్టీలోకి వచ్చిన వారికి రాబోయే రోజులో అని విధాలుగా తోడుగా ఉంటాను అని భరోసా ఇచ్చారు .కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా , వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారన్నారు..ఈ కార్యక్రమం లో మార్కాట్టు మాజీ సర్పంచ్ ఎల్లప్ప ఎంపీటీసీ లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు , బివీఆర్ అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.


