మహాశివరాత్రికి ప్రత్యేక పూజలు..భక్తులు సద్వినియోగం చేసుకొండి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: వెంకటేశ్వర స్వామి దేవాలయం కర్నూల్ నగరం బ్రాహ్మణ సంఘం ఆలయ కమిటీ సభ్యులు హాజరై 15/ 2 / 26 మహాశివరాత్రి రోజున శ్రీ భవాని సమేత రామలింగేశ్వర స్వామి వారికి అభిషేకాలు అర్చనలు. నందీశ్వరుని వద్ద లింగం ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా జులాభిషేకం చేసుకుంటారు. రాత్రి 12 గంటలకు లింగోద్భోవం సమయంలో అభిషేకాలు అనంతరం స్వామివారి గర్భగుడి లో కి భక్తులు అందరూ వరస గా వెళ్ళి జలాభిషేకం చేసుకోను ట అనంతరం స్వామివారి అమ్మవారి కళ్యాణo ఏర్పాటు గురించి తీర్మానాలు చేయటం జరిగింది. అలాగే 16 /2 /26 న ఉదయం స్వామివారికి అన్నాభిషేకం మధ్యాహ్నం కళ్యాణ భోజనాలు ఏర్పాటు చేయడం సాయంత్రం స్వామివారి రథోత్సవం నిర్వహించడం ప్రసాద వితరణ గురించి తీర్మానాలు చేయడం జరిగింది. ఆరు బయట దేవాలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణం నిర్వహించుట కళ్యాణం లో పాల్గొనేవారు 1116/-చెల్లించేలాగా, అలాగే నందీశ్వరుడు వద్ద లింగం ఏర్పాటుచేసి అందరూ కూడా దానికి అభిషేకం చేసుకునేందుకు అవకాశం కల్పించుట అలాగే లింగోద్భవ సమయం లో ప్రతి ఒక్క భక్తుడు కూడా గర్భాలను లోకి వెళ్లి స్వామివారికి జలాభిషేకం చేసు కొనుటకు అవకాశం కల్పించుట అలాగే , శివరాత్రి రోజు స్వామివారి దర్శనం ప్రవచనాలు భక్తి గీతాలు అలా పించుట కొరకు ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది.

