ఈడుపుగంటి నవరాజుకు ఘనంగా నివాళులు
1 min read

భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైఎస్ఆర్సిపి ఏలూరు నియోజకవర్గం ఇంచార్జ్ జె పి
కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పలువురు వైసీపీ నేతలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మాజీ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లం గొళ్ళ శ్రీలక్ష్మి భర్త ఈడుపుగంటి నవరాజు శనివారం స్వర్గస్తులైనారు. వారి భౌతిక దేహానికి పూలమాలలతో నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయ ప్రకాష్ (జె పి) ఆయనతో పాటు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నుకపెయ్యి సుధీర్ బాబు,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నేరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథ్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, మాజీ డిప్యూటీ మేయర్ గుడివాడ కిషోర్, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్ ,మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు డింపుల్ జాబు, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇనుపనూరి జగదీష్ కేదారేశ్వరి, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్ , స్థానిక నాయకులు నివాళులర్పించారు.

