‘ అంకుర అపెక్స్’ .. అభివృద్ధి చెందాలి
1 min read
హాస్పిటల్ ను ప్రారంభించిన ఎంపీ నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, కుడా చైర్మన్ వెంకటేశ్వర్లు
కర్నూలు, న్యూస్ నేడు:శ్రీ సత్య సాయి జయంతి రోజున అంకుర అపెక్స్ హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమని ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూలు పట్టణం గాయత్రి ఎస్టేట్ లో అంకుర అపెక్స్ హాస్పిటల్ ను ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, కుడా చైర్మన్ వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ వైద్య రంగంలో అంకుర అపెక్స్ హాస్పిటల్ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. హాస్పిటల్ యాజమాన్యం డా. రమణ, డా. మల్లేశ్వరికి ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్ హబ్గా పేరుగాంచిన కర్నూలులో కొత్త హాస్పిటల్ ప్రారంభించడం సంతోషకరమన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక నుంచి వచ్చే పేద రోగులకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఆ తరువాత హాస్పిటల్ యజమానులు డా. రమణ, డా మల్లేశ్వరి మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో రోగులకు వైద్యం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తామని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాయలసీమ ప్రజలు తమను ఆదరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. అంతకు ముందు హాస్పిటల్ లో రోగులకు కల్పించిన సౌకర్యాలు, వసతులను ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, కుడా చైర్మన్ వెంకటేశ్వర్లు తదితర అతిథులు పరిశీలించారు.




