పల్స్ పోలియో పైన అవగాహనా ర్యాలీ
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: 5 సంవత్సరాల పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయించి పోలియో ను నిర్ములించాలని, నిండు జీవితం నకు రెండు పోలియో చుక్కలు అని వైద్యాధికారి రాహుల్ అన్నారు.ఈసందర్భంగా శుక్రవారం ప్యాపిలి పట్టణంలో విద్యార్థుల చేత పల్స్ పోలియో పైన అవగాహనా ర్యాలీ నిర్వహిస్తూ ఆదివారం మీ గ్రామముల లోని బూత్ లలో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయించి పోలియో ను నిర్ములించాలని, నిండు జీవితం నకు రెండు పోలియో చుక్కలు అని, ప్రజలు పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేయాలనీ అవగాహనా కల్పించారు. ఈకార్యక్రమం లో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాఘవేంద్ర గౌడు, పర్యవేక్షకులు సరోజ, మల్లికార్జున, అబ్దుల్లా, ఏ ఎన్ ఎం లు అరుణబాయ్, శోభా, వైద్య సిబ్బంది,ఆశ కార్యకర్తలు, విద్యార్థినిలు పాల్గొన్నారు.


