NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్రెయిన్ ట్యూమర్ ను ప్రారంభ దశ లోనే గుర్తించాలి…

1 min read

తలనొప్పి, వాంతులు దృష్టిలోకం లక్షణాలు కనిపిస్తే బ్రెయిన్ క్యాన్సర్

– డాక్టర్ విశ్వనాథ్

కర్నూల్ హాస్పిటల్,న్యూస్ నేడు : ప్రతి సంవత్సరం జూన్ 8న నిర్వహించే వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలులో బ్రెయిన్ ట్యూమర్లపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు, ముందస్తు గుర్తింపు, చికిత్స మరియు ఆధునిక వైద్య సదుపాయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సంవత్సరం వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే థీమ్ “A Closer Look”. ఈ థీమ్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్ రోగులు ఎదుర్కొనే సవాళ్లను మరింత దగ్గరగా అర్థం చేసుకోవడం, వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించడం మరియు సమయానికి చికిత్స అందించడం యొక్క ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్నారు.ఈ సందర్భంగా న్యూరోసర్జన్ డా. విశ్వ కుమార్ కె.ఎస్  మాట్లాడుతూ, బ్రెయిన్ ట్యూమర్ అనేది మెదడులో అసాధారణ కణాల పెరుగుదల వల్ల ఏర్పడే సమస్య అని తెలిపారు. తరచుగా తలనొప్పి, వాంతులు, చూపు మందగించడం, చేతులు లేదా కాళ్లలో బలహీనత, మూర్ఛలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ, ఆధునిక న్యూరో ఇమేజింగ్ సాంకేతికతలు మరియు అధునాతన న్యూరోసర్జరీ పద్ధతుల ద్వారా ప్రస్తుతం బ్రెయిన్ ట్యూమర్లను సమర్థవంతంగా గుర్తించి చికిత్స చేయడం సాధ్యమవుతోందని తెలిపారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా చికిత్స ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు బ్రెయిన్ ట్యూమర్లకు సంబంధించిన పలు సందేహాలను అడగగా, వైద్యులు వాటికి సమగ్ర సమాధానాలు అందిస్తూ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ, “బ్రెయిన్ ట్యూమర్లపై ప్రజల్లో సరైన అవగాహన ఉండటం చాలా అవసరం. ప్రారంభ లక్షణాలను గుర్తించి సమయానికి వైద్యులను సంప్రదించడం ద్వారా మెరుగైన చికిత్స పొందే అవకాశం ఉంటుంది. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం మెడికవర్ హాస్పిటల్స్ నిరంతరం ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆరోగ్య సేవలను మరింత చేరువ చేస్తున్నది” అని తెలిపారు.

About Author