NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జనాభా లెక్కల ప్రీ-టెస్ట్ ఖచ్చితంగా నిర్వహించాలి

1 min read

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

నంద్యాల, న్యూస్​ నేడు: మహానంది మండలంలో పైలట్ ప్రాతిపదికన జరగనున్న జనాభా లెక్కల (Census) ప్రీ-టెస్ట్ కార్యకలాపాలు ఖచ్చితత్వంతో, సమయపాలనతో సాగేందుకు సంపూర్ణ శిక్షణతో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో 2027 జనాభా లెక్కల ముందస్తు సెన్సిటైజేషన్ కార్యక్రమాలపై నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణా సమావేశంలో కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డిఆర్ఓ రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రాబోయే 2027 జనాభా లెక్కల ప్రీ-టెస్ట్ కార్యకలాపాలు అత్యంత ప్రాధాన్యమైనవని, సెన్సస్ ప్రక్రియలో ఎన్యుమరేటర్‌లు, సూపర్వైజర్‌లు సంపూర్ణ శిక్షణ పొంది ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఈ పనిని సమయపాలనతో, నిర్దిష్ట విధానంలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా ఉపయోగించి పూర్తి చేయాలని ఆమె పేర్కొన్నారుజిల్లాలో జనాభా లెక్కల ముందస్తు పరీక్ష కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సమన్వయం, శిక్షణ, క్షేత్ర స్థాయి వ్యూహాల రూపకల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశం చివర్లో జిల్లా అధికారులతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించి, క్షేత్రస్థాయి అమలు పద్ధతులు, సాంకేతిక సమస్యలు, పరిష్కారాలపై చర్చించారు.

About Author