ప్రజా సమస్యల పరిష్కార దిశగా చింతలపూడి ఎమ్మెల్యే దంపతులు
1 min read

క్యాంపు కార్యాలయంలో పలు సమస్యలపై అర్జీలు అందజేత
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని భరోసా
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : విదేశాల నుంచి రావడమే చింతలపూడి నియోజకవర్గ ప్రజా సమస్యలు విని శాసన సభ్యుల వారి సతీమణి విజయ సొంగా చింతలపూడి శాసన సభ్యుల వారి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన శాసనసభ్యులు సతీమణి, అప్పటికే కార్యాలయానికి వికలాంగ పెన్షన్ మంజూరు కోసం అభ్యర్థించడానికి విచ్చేసినటువంటి వారితో శాసనసభ్యులు వారితో కలిసి వారి సమస్యలు విని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తప్పనిసరిగా వికలాంగ పెన్షన్ మంజురు ఆయ్యేలాగా కృషి చేస్తానని చెప్పి శాసనసభ్యులు తో కలిసి వారి సతీమణి భరోసా కల్పించడం జరిగింది, అంతేకాకుండా వారి అవసరతలు గుర్తించి కొంత సహాయం చేయడం కూడా జరిగింది.మంచి హృదయం తో సహాయ సహకారాలు అందిస్తున్న శాసనసభ్యులు దంపతులకు పలువురు నియోజకవర్గ సభ్యులు కొనియాడుతున్నారు.


