ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
1 min read
పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఎం ఎల్ ఏ రోషన్ కుమార్ చేతుల మీదుగా సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు.పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.గురువారం రూ.1,34,962/–విలువగల చెక్కులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ తన క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎంతోమంది పేదలకు వైద్య పరంగా చేసిన ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మరల తిరిగి ఇవ్వడం ద్వారా ఆయా కుటుంబాలను ఆదుకోగలుగుతున్నామని రోషన్ కుమార్ పేర్కొన్నారు.


