వేగంగా జిల్లా పరిషత్ లో డ్రైనేజీ పనులు
1 min read

నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన డిఈ శ్రీనివాసరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లాపరిషత్ ప్రాంగణంలో డ్రైనేజీ ఔట్ లెట్ నిర్మాణ పనులను పంచాయితీ రాజ్ (పిఆర్ఐ) సబ్ డివిజన్ డిఈ శ్రీనివాస రావు నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. బుధవారం అక్కడి సిబ్బంది చేస్తున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యత ఏమాత్రం లోపించకుండా, పటిష్టంగా వేగంగా పనులు జరగాలని సిబ్బందికి సూచనలు చేశారు.

