దసరా సెలవులు మహాలయ అమావాస్య 22 నుండి ఇవ్వాలి: ఆప్టా
1 min read

అమరావతి, న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో విజయ దశమి (దసరా) ముఖ్యమైనది. ఈ పండగ కోసం గతములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాలయా అమావాస్య నుంచి దశమి వరకు సెలవులు ఇచ్చే అనవాయితీ ఉంది. అయితే ఈ సంవత్సరం కొత్తగా 24 వ తేదీ నుండి ఇచ్చారు. కాబట్టి దానిని మార్చి రాష్ట్రం లో అన్ని పాఠశాల లకు మహాలయ అమావాస్య నుండి సెలవులు అనగా సెప్టెంబర్ 22 నుండి సెలవు లు ప్రకటించాలని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) సంఘం పక్షాన మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు కి, పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కి మరియు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కి లేఖ ద్వారా వ్రాత పూర్వకంగా విజ్ఞప్తిచేయడం జరిగింది.మన ప్రక్క తెలుగు రాష్ట్రం తెలంగాణ లో కూడా మహాలయ అమావాస్య నుండి పాఠశాల లకు సెలవులు ప్రకటించారని, మన రాష్ట్రం లో ఈ నెల 24 నుంచి సెలవులు ఇచ్చారని, అలా కాకుండా మహాలయ అమావాస్య నుండి అనగా నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవలు ఇచ్చి హిందువుల మనోభావాలను గౌరవించాలని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షులు ఎ జి ఎస్ గణపతి రావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రకాష్ రావు పత్రిక లకు తెలియచేశారు.

