NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నారాయణ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

1 min read

కర్నూలు, న్యూస్ ​నేడు : నారాయణ రెసిడెన్షియల్ స్కూల్, యెలుకూరు బంగ్లా, కర్నూలులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి, జాతీయ స్ఫూర్తి మరియు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ లక్ష్మీ ప్రసాద్ గారు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని, విద్యార్థులు క్రమశిక్షణ, నిజాయితీ, పట్టుదల మరియు దేశభక్తితో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని కష్టపడి సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.కార్యక్రమానికి గౌరవ అతిథిగా AGM శ్రీ రమేష్ గారు హాజరై మాట్లాడుతూ, స్వాతంత్ర్యం మనకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా అందించిందని అన్నారు. విద్యార్థులు సమయపాలన, క్రమశిక్షణ, ఐకమత్యం మరియు సేవాభావాన్ని అలవర్చుకుని దేశ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు.పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ సత్యనారాయణ రెడ్డి  మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు మంచి విలువలను అలవర్చుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో A.D. సురేష్, A.O. దస్తగిరి, రవిబాబు – CCA ఇన్‌చార్జ్, ఇస్మాయిల్, సుంకన్న, నరసింహ, నాగమణి – హాస్టల్ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.పాఠశాల బోధనా మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, ప్రసంగాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ సమైక్యత, శాంతి, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *