NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలులో ఘనంగా టిడిపి నూతన కార్యాలయానికి భూమి పూజ

1 min read

కార్యక్రమంలో పాల్గొన్న ఆలూరు ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి

పార్టీ బలోపేతానికి కీలక అడుగు  కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసిన వేడుక

అభివృద్ధి దిశగా టిడిపి మరొక ముందడుగు

ఆలూరు న్యూస్ నేడు: కర్నూలు జిల్లాలో తెలుగు దేశం పార్టీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం  ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జ్  వైకుంఠం జ్యోతి  ముఖ్యంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధి మరియు బలోపేతం దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగని తెలిపారు. కొత్త కార్యాలయం పార్టీ కార్యకర్తలకు మరింత ప్రేరణగా నిలుస్తుందని, ప్రజలకు సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు.ఈ భూమి పూజ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమం విజయవంతంగా ముగియడం పట్ల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *