త్రో బాల్ పోటీలలో హొళగుంద మండల టీం రన్నర్ అప్ గా ఎంపిక
1 min read

హొళగుంద న్యూస్ నేడు : ప్రభుత్వం ఉపాధ్యాయులకు నిర్వహించిన క్రీడల పోటీలలో ఆదోని నందు జరిగిన డివిజన్ లెవెల్ త్రో బాల్ పోటీలలో హొళగుంద మండల టీం రన్నర్ అప్ గా ఎంపిక అయింది అలాగే విద్యార్థులకు రోటరీ క్లబ్ వారు నిర్వహించిన క్రీడలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోహొళగుంద బాలికల కబడ్డీ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హొళగుంద ప్రధానోపాధ్యాయులు పి, కబీర్ సాబ్ క్రీడలలో పాల్గొన్న విద్యార్థులు మరియు ఉపాధ్యాయులను అభినందించారు ఈ కార్యక్రమంలో కబడ్డీ జట్టు బాలికలకు ఉపాధ్యాయులకు షీల్డ్ మెడల్స్ సర్టిఫికెట్లు అందజేశారు.


