NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 (KAI) కోర్ కమిటీ సభ్యునిగా  డాక్టర్ కోలా ప్రతాప్ నియామకం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా (KAI) దేశవ్యాప్తంగా కరాటే అభివృద్ధి, పరిపాలనా పారదర్శకత మరియు క్రీడాకారుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కోర్ కమిటీలో డాక్టర్ కోలా ప్రతాప్ ని సభ్యునిగా నియమించింది.KAI అధ్యక్షుడు బైకుంఠ్ సింగ్ మరియు ప్రధాన కార్యదర్శి యోగేష్ కల్రా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ నియామకాన్ని ప్రకటించారు. కోర్ కమిటీలో డాక్టర్ కోలా ప్రతాప్‌తో పాటు జైదేవ్ శర్మ, అమిత్ గుప్తా, సుశీల్ శర్మ మరియు దేవాశిష్ మండల్ సభ్యులుగా నియమితులయ్యారు.

ఈ కోర్ కమిటీ ప్రధాన బాధ్యతలు:సంఘాలలో తలెత్తే వివాదాల పరిష్కారం, ఎన్నికల నిర్వహణలో పారదర్శకత పర్యవేక్షణ,క్రీడాకారుల సంక్షేమం మరియు అభివృద్ధికి కృషి, గౌరవ పదవులు మరియు కమిషన్లకు సిఫార్సులుభవిష్యత్ కార్యక్రమాల ప్రణాళిక మరియు అమలుఆర్థిక అంశాలపై సమీక్ష మరియు సలహాలుఈ సందర్భంగా డాక్టర్ కోలా ప్రతాప్  నియామకాన్ని కరాటే వర్గాలు హర్షించాయి. ఆయన అనుభవం, సేవాభావం మరియు క్రీడాభివృద్ధికి చేసిన కృషి కోర్ కమిటీ పనితీరుకు మరింత బలాన్నిస్తాయని అభిప్రాయపడ్డారు.KAI నాయకత్వం కోర్ కమిటీ సభ్యులు క్రమశిక్షణ, నిష్పక్షపాత ధోరణి మరియు అంకితభావంతో భారతదేశంలో కరాటే అభివృద్ధికి కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేసింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *