NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కమ్మ కులంపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కమ్మ సంఘాలు..

1 min read

విజయవాడ, న్యూస్ నేడు: పల్నాడులో కమ్మ కులంపై జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని గుంటూరు జిల్లా కమ్మ సేవా సమితి అధికార ప్రతినిధి పువ్వాడ సుధాకర్ రావు అన్నారు. శుక్రవారం, గాంధీనగర్, ప్రెస్ క్లబ్ లో  కే జి ఎఫ్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్, ఆంధ్రప్రదేశ్  లోని పలు కమ్మ సంఘాలను కలుపుకొని, కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాల మధ్య సామరస్యం ఎంతో అవసరమన్నారు. రాజకీయ నాయకులు కమ్మ సామాజిక వర్గంపై చేస్తున్న విమర్శలు సరికాదన్నారు.ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకెళ్లాలని హితవు పలికారు. ఇకముందు తమ సామాజిక వర్గాన్ని ఎవరైనా విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.కమ్మ సేవాసమితి విజయవాడ ఉపాధ్యక్షులు గుమ్మడి రామకృష్ణ మాట్లాడుతూమా వేళ్ళతో మమ్మల్నే పొడుస్తున్నారని, మీరు రాజకీయాలు మాట్లాడండి కానీ కులాల పేరు వద్దని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. అసెంబ్లీ లో భువనేశ్వరి ని అవమాన పరిచేలా మాట్లాడి వైఎస్ఆర్సిపి నాయకులు నవ్వుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మతాలు, కులాలు వద్దు విధానాలు మాట్లాడండమన్నారు. తాము టీడీపీ కి దాసోహం కాదు,1971 నుంచి 13 మంది సీఎం లను చూసాం ఎవరు కులాల మీద టార్గెట్ చేయలేదన్నారు. సమాజంలో ఏ సామాజిక వర్గానికీ కులాన్ని ఆపాదించి మాట్లాడవద్దని కులాలను విమర్శించి రాజకీయాలు చేయొద్దని సూచనలు చేశారు. సమాజ సేవకు కమ్మ కులం కట్టు పడి ఉందని తమ కులాన్ని అగౌరవ పర్చవద్దన్నారు.కమ్మ కులం పై ఏ రాజకీయ పార్టీ విమర్శలు చేసినా సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో మహిళా సెక్రటరీస్వరూప రాణి, సూరపనేని.. ఎ పికెఎస్ ఎస్ నాయకులు నాదెండ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *