NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ కిక్​ బాక్సింగ్​ ’ లో కర్నూలు క్రీడాకారుల ప్రతిభ

1 min read

అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన త్రినాథ్​ అకాడమీ క్రీడాకారులు

  • బంగారు, వెండి, సిల్వర్​ పతకాలు కైవసం
  • విజేతలను అభినందించిన  త్రినాథ్​ అకాడమీ చైర్మన్​  డా.త్రినాథ్​

కర్నూలు, న్యూస్​ నేడు :కిక్​ బాక్సింగ్​ క్రీడలో కర్నూలు క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు న్యూఢిల్లీలోని జాదవ్​ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ స్థాయిలో కర్నూలు త్రినాథ్​ అకాడమీ క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. కర్నూలుకి సంబంధించిన కిక్ బాక్సింగ్ క్రీడాకారులు కు బంగారు,  వెండి పతకాలు కైవసం చేసుకున్నారు.   కిక్​ లైట్​ ప్లస్​ 69 కేజీల విభాగంలో రామ్​చరణ్​కు బంగారు పతకం సాధించగా… టీత్ గణపతి దేవ్​జి మైనస్ 69 కేజీల కిక్ లైట్ విభాగంలో సిల్వర్  ,  పాయింట్ ఫైవ్ మైనస్ 69 కేజీల విభాగంలో  కాంస్య​ , గుర్రం హరి కళ్యాణ్ రింగ్ ఫైట్ లోకి కిక్  విభాగంలో  మైనస్ 75 కేజీల విభాగంలో  కాంస్య ​,  లౌకిక ఈవెంట్లో  జై కళ్యాణ్ మైనస్ 67 కేజీల విభాగంలో  సిల్వర్ పతకం సాధించారు.

విజేతలకు అభినందన: డా. త్రినాథ్​

కిక్​ బాక్సింగ్​ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులను త్రినాథ్​ అకాడమీ చైర్మన్​ డా. త్రినాథ్​ అభినందించారు.  బుధవారం అమ్మ హాస్పిటల్​ అధినేత డా.త్రినాథ్​ ను కలిసిన క్రీడాకారులను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.  అనంతరం డా. త్రినాథ్​ మీడయాతో మాట్లాడుతూ   కిక్​ బాక్సింగ్​ క్రీడలో రాణిస్తున్న క్రీడాకారులు మానసికంగా, శారీరకంగా ధృఢంగా ఉంటారని, చదువులోనూ రాణిస్తారన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న కిక్​ బాక్సింగ్​ క్రీడపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చన్నారు. కర్నూలు నగరంలోని డా. త్రినాథ్​ అకాడమీలో కోచ్​ నరేంద్ర ఆచార్య శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచేలా శిక్షణ ఇచ్చిన కోచ్​ నరేంద్ర ఆచార్య ను కూడా ఈ సందర్భంగా డా.త్రినాథ్​ అభినందించారు.

About Author