NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహానందీశ్వరుడి హుండీ ఆదాయం రూ.62.17 లక్షలు

1 min read

ఆలయ ఈవో ఎన్. శ్రీనివాసరెడ్డి 

మహానంది, న్యూస్ నేడు: మహానంది పుణ్యక్షేత్రంలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా  హుండీ లెక్కింపు నిర్వహించగా దేవస్థానానికి రూ.62,17,845   లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఎన్ శ్రీనివాసరెడ్డి  తెలిపారు. గురువారం ప్రధాన ఆలయాల్లో భక్తులు 61రోజులపాటు సమర్పించిన హుండీ కానుకలను లెక్కించామన్నారు.ఆలయాల ద్వారా రూ.61,59,832 అన్న ప్రసాదం హుండీ ద్వారా రూ.26,683  గోసంరక్షణ ద్వారా రూ.31,330 వేలు వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. అలాగే విదేశీ కరెన్సీ అరబ్ దినార్-1,10 డాలర్-1,1 డాలర్-3 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో మధు, పర్యవేక్షకులు శశిధర్ రెడ్డి, నీలకంటేశ్వర్ రాజు, ఇన్స్పెక్టర్లు, వెలుగోడు గ్రూప్ దేవాలయాల ఈఓ జనార్దన్, అర్చకులు, సిబ్బంది, ఏజెన్సీ వర్కర్స్, శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్,తిరుమల బాలాజీ సేవా సమితి,భ్రమరాంబిక సేవా సమితి, శ్రీరామ సేవ ట్రస్ట్ సేవకులు భక్తులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *