బేడ బుడగ జంగం యువత సమావేశం జయప్రదం చేయండి.. తూర్పాటి మనోహర్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూల్ సిల్వర్ జూబ్లీ కాలేజ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి, అనంతరం ” బేడ బుడగ జంగం యువత సమావేశం” కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగినది.ఈ యొక్క సమావేశం ఈనెల 18వ తేదీన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లైన్, హార్ట్ ఫౌండేషన్ నందు సమావేశం ఉండనని, కావున ఈ యొక్క సమావేశానికి యువత, డిగ్రీ, బి.టెక్, ఎంటెక్, ఎంబిబిఎస్ , చదివి నిరోధకులుగా ఉన్నవారు, చదువుతున్నవారు ఈ యొక్క సమావేశానికి వచ్చి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, జాతి రిజర్వేషన్ పై భవిష్యత్ కార్యాచరణం రూపొందించుటకే, కదలి రావాలని, యువత మౌనంగా ఉండకుండా, మీ భవిష్యత్తు, జాతి భవితరాల భవిష్యత్తు కాపడుటకే కదలిరావాలని, ఎవరి మీద ఆధారపడకుండా ,మన శక్తి మీద, మన ధైర్యం మీద ఆధారంతోనే ఢిల్లీలో మన సమస్య పరిష్కరించుకోవడానికి, ఈ ప్రభుత్వాలు ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా చేయూటకే, యువత కదలి వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి పెద్ద చింతలయ్య, రమణయ్య, జమ్మయ్య, సవారి, మాధవరావు, అంజి, నరేష్, రాముడు, జమ్మన్న మొదలగు వారు పాల్గొన్నారు.


