సిఐ జయన్న ను కలిసిన నలుగుదొడ్డి గ్రామస్తులు
1 min read
మొహరం పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని సిఐ సూచన
న్యూస్ నేడు,పత్తికొండ : మొహరం పండుగ సందర్భంగా పత్తికొండ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ.జయన్నను మండల పరిధిలోని నలకదొడ్డి టిడిపి గ్రామ అధ్యక్షుడు బత్తిన రాజశేఖర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు సిఐ కార్యాలయంలో కలిసి మొహరం పండుగ అనుమతి కోసం వినతి పత్రం అందించారు. మొహరం పండుగను గ్రామములో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని, అదేవిధంగా గ్రామంలో సిసి కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు.ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నలగదొడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

